శ్రీచిత్రకూటమౌ చిత్రకూటాద్రి
వాచంయమశ్రేణి వర్ణింప నుండి
యంత రాముఁడు భరతాగమనంబు
చింతించి ‘యిచట వసింపరా’దనియు,
‘నిచ్చట నే నున్న నెల్లపౌరులును
ముచ్చటపడి దినంబును వత్తు’రనియు,
‘దంతిరథాశ్వపదాతి వర్గముల
నెంతయుఁగాసిల్లు నీ వనం’బనియు,
‘ఖరదూషణాదిరాక్షసకోటిబాధ
పరిహరింపు’మటంచుఁబరమసంయములు
చెంతలఁజేరి సూచించినా రనియుఁ
జింతించి మఱునాఁడు చిత్రకూటాద్రి
మునుల వీడ్కొని యత్రిమునియాశ్రమమున
కనురాగమున నేఁగ నమ్మహామౌని
తన శిష్యులును దానుఁదగ నెదుర్వచ్చి
కొనిపోయి పలుదెఱంగులఁబూజసేసె.
.......... ..........బూజసేసి
దేవ!రాఘవ!యేఁగుదెంచు నీ తెఱఁగుఁ (కేళి) భావించి యెంతయు భాగ్యుండనైతి
హరియును హరుఁడును నజుఁడునుదొల్లి యిరవొంద ననసూయ కిచ్చినతొడవు
లవి వేడ్క సీతకే యర్హంబు గాన దవిలి యొసంగు తాత్పర్యంబుతోడ
నెదురు చూచుచు నుండె నీ పర్ణశాల (నెపుడనసూయ) కదెపోయి తొడవులొయ్యనఁదాల్పఁబనుపు
మనవుడు రఘురాముఁడాశ్చర్యమంది మునినాథ! యా మహాత్ములు మీకు నీక
యనసూయ కొసఁగుట యది యెట్టులనిన విను రామ! యది దివ్యవృత్తాంత మొకటి
మునులు నేనును శిష్యముఖ్యులుఁగూడి(డ) చని యనుష్ఠానంబు సలుపుచున్నెడను
అనలార్కనిభతేజులంత నిక్కడను అనసూయ యనునామ మరసి చూచుటకు
హరియు బ్రహ్మయు బాలహరిణపాణియును (పురహరుఁడును వేగ) నరిగి యచ్చటనున్న యనసూయఁగాంచి
కడువృద్ధవిప్రుల కైవడిఁ దోఁప వడవడ వడఁకుచు వచ్చినఁజూచి
యా రమణియు నప్పుడర్ఘ్యపాద్యములు గారవంబున నిచ్చి కడఁగి వారలకుఁ
గుశపీఠమొనరించి కూర్చుండఁబెట్టి కుశలత్వమడిగి యా కులపత్ని యనియె
ఆతత రవితేజులార! మీకిచట నాతిథ్య మనిన నా యనఘు లిట్లనిరి
నీ పతి యెప్పుడు నెలఁతుక వచ్చుఁ దాపంబుపెంపున ధరియింప రాదు
ఏ వేల్పు మొదలైన దిది యెవ్వఁ (యిపుడెప్పు)డెఱుఁగు? నా వేల్పు దన వేల్పు నర్చించు నె(మ)పుడు?
పోయెద మే మన్నఁ బొలఁతుక భక్తిఁ బాయసాన్నంబప్డు పక్వంబు సేసి
విచ్చేయుఁడని తమ్ము వేఁడినఁజూచి యిచ్చలో భావించి యిట్లని రపుడు
ఓయమ్మ! నీవిందు నుచితభోజ్యంబు పాయసాన్నంబైనఁ బరితృప్తిగాదు
వల్కలంబగు మేనివస్త్రంబుఁబాసి (మక్కువ వల్కలాంబరముతోఁబాసి) యల్క దోపక (అక్కజంబగు)భక్తి నన్నంబు మాకు
నిచ్చుట గలదేని నెసగంగ నీకు నిచ్చును దైవంబు నిహపరోన్నతులు
అనవిని యనసూయ యగుఁగాక యనుచు మనమున హర్షించి మది నన్ను (మాధవుఁ) దలఁచి
యే నత్రిపదపద్మ హితబుద్ధినేని? నేను దపఃకర్మ మెఱిఁగితి నేని?
నిమ్ముల ధర్మంబు లెఱిఁగితినేని? నిమ్మువ్వురును బాలురిట యౌదు రనిన
నత్తెఱంగున వారలటు బాలురైరి అత్తన్వియును నంత నా చందమునను
ఆ బాలురకుఁబాలు నరసి త్రావించి తా బాలపర్ణముల్ తఱచుగాఁబఱచి
శయనింపఁజేయనంతట నే(నచ్చటికే) ను వచ్చి నయముననేడ్చు నన్నాద మాలించి
పరమయోగాభ్యాసభావంబునందుఁ బరమమూర్తులు గాఁగ భావించి చూచి
హే హరిహరబ్రహ్మ! హితబుద్ధి మిమ్ము నా హృదయంబున నర్చింప నేను
ఏ మిమ్ముఁబొడగంటి నేము ధన్యులము ఏము చేసిన తపంబెల్లను బండె
నరుదార మీవల్ల నని నుతిసేయ హరిహరబ్రహ్మలిట్లనిరి నాతోడ
నో మునినాథ!మిమ్మొక మునీశ్వరుల నే(కే)మని సరిచేసి యెన్నంగవచ్చు?
నీ వరకులపత్ని నెరపిన సత్య భావంబు లోకంబుఁబరగించు టొప్పు
ననసూయ నీకును నతివ గావునను ఎనయఁదపంబున కేల విఘ్నంబు
గానేర్చు నీ సాధ్వి ఘనసత్యశీల మానితగుణలోకమాన్యయు ననఁగ
నీ యనసూయకు నిట్టినామంబు పాయక లోకంబు పరగించు టొప్పు
నని యని పలుమాఱు నభినుతి సేసి మనుజేశ! నీ మూర్తిమయమైన యతఁడు
కరము శోభితమైన ఘనమణిప్రభలఁ దరుణార్కదీధితి తమము నడంచు
మనమునఁజోద్యమౌ మహితభూషణము లనసూయ కొసగె నా యంబుజోదరుఁడు
ఇచ్చియు ననుఁజూచి యింపార నీకు నిచ్చెద నొకవర మేదైన నడుగు
మనవుడు నే నప్డు హర్షంబు నొంది ఘనభక్తితోఁగరకమలముల్ మొగిచి
యనుమతించుఁడు మిమ్ము నడిగెదనొకటి యనసూయగర్భంబునందు జన్మించి
కరమర్థిఁబిదప మీ కైవల్య మొసగు వరమిత్తు రటుగాక వరము నొండొల్ల
నన విని యా మువ్వురౌ(మూర్తులౌఁ) గాక యనుచుఁ దన తన యంశంబుదగఁబుట్టిరపుడు
హరుఁడు దుర్వాసుండు నజుఁడు సోముండు హరియు దత్తాత్రేయుఁడై పుట్టిరంత
మనమున సంతోషమగ్నులై యప్పు డనఘులు తమయెడ కరిగిరి అంత
నతివ భూషణము లీ యవనిజ కొసగ నతిముదంబున నుండె నా యనసూయ
కాన, యా తొడవులు గైకొనుటకును మానవేశ్వర! పంపు మహిపుత్త్రి నిప్పు
డన విని రఘురాముఁడా మునినాథుఁ గనుఁగొని పల్కె నుత్కంఠ దీపింప
నో మునినాథ! నీ కుచితమే తలఁపు? మా మీరెఱుఁగరే మా కులక్రమము?
నిరవంద విప్రుల కిచ్చుట మాని అరుహమే విప్రార్థ మార్జింప మాకు
నన విని మునినాథుఁ డా రామచంద్రుఁ గనుఁగొని నరుఁడువు గావు నీ వరయ
నఖిలేశ! మీ తత్త్వ మరసి చూచినను అఖిలాండములు మీకు నఱచేతిపండు
లటుగాన యీ సీత యఖిలాండమాత యిటు తోడవ(తొడవి)చ్చిన యీవు విష్ణుండవు
చటుల శతానల జ్వాలమై యొప్పు ఘటితారుణంబులఁగల దీప్తులొప్ప
నిర్మలమణిగణ నికర మీ తొడవు ధర్మంబు రఘురామ! దాల్పంగ దీని
నడవులఁగందమూలాహార నియతి నెడపక మునులమై యిహవృత్తి మఱచు
తపమేడ?యిది దాఁచుతఱియేడ?మఱియుఁ దపమునకిది చూడఁదగు విఘ్నకారి
యిది సీత ధరియింప నిప్పుడే పనుపు కదిసి మా సంతోషకరము గైకొనుము
అన విని రఘురాముఁడవనిజఁజూచి మనమున సంతోషమహిమతో ననుప
ననలసమానమై యట తన్నుఁబోలి యనయంబుఁబ్రియమందుననసూయఁ గాంచి
యడుగుల కెఱఁగిన ననసూయ ప్రీతిఁ గడువేడ్కతోఁగ్రుచ్చి కౌఁగిటఁజేర్చి
యమ్మునిపత్నియు.......... ..........
నమ్మునిపత్నియు ననసూయ ప్రీతి
నమ్మహీతనయకు నాతిథ్య మొసగి
తెఱఁగొప్పఁగొన్ని పతివ్రతాగుణము
లెఱిఁగించి, రఘురాము నెడఁబాయలేక
తన బంధుజనులనందఱ నెఁడబాసి
వనముల కా సీత వచ్చుట పొగడి
పిమ్మట ననసూయ ప్రీతిదానముగ
నమ్మహీతనయకు నంగరాగములు
వాడని విరుల చెల్వపుదండతోడఁ
గూడ మాయనిమడుంగులను దా నొసగి:
“రమణి! నిన్ను స్వయంవరమున రాఘవుఁడు
క్రమమొప్పఁగైకొన్న కథదెల్పు.”మనిన,
జిలిబిలిసిగ్గును జిఱునవ్వుఁదొలఁకఁ
బలికె జానకి దన పతిని వీక్షించి:
“వినవమ్మ! మిథిలకు విభుఁడైన యట్టి
జనకుఁడొక్కెడ యాగశాల దున్నింపఁ
గలిగితి నే; నది గారణంబునను
కలిత సీతానామకమున నొప్పితిని;
అనపత్యుఁడౌట నయ్యవనిపాలకుఁడు
దనయఁగా నన్ను మోదంబునఁబెనిచె.
నంత యౌవనవతినగు నన్నుఁజూచి
చింతించి:“తన యింటి శివునిచాపంబు
నెక్కువెట్టినవాని కెలమి పెంపొంద
నిక్కన్యకామణి నిత్తునే.”ననుచు
వరబుద్ధిమై స్వయంవరము సాటింప
ధరణినాయకులు మొత్తంబులై వచ్చి
శైలజరమణుని చాపమెత్తంగఁ
జాలక, మోపెట్టఁ జాలక చనిరి.
అంతరాఘవుఁడు విశ్వామిత్రుఁగొలిచి
కొంత గాలంబునకును నటవచ్చి
కరి యిక్షుకాండంబు ఖండించునట్లు
హరువిల్లు విఱిచి చయ్యన నన్ వరించె.”
నని తన పెండ్లివృత్తాంతమంతయును
వినిపింప ననసూయ విని ముదమందె.
నప్పుడు రవి పశ్చిమాంబుధి మునుఁగఁ
దప్పక సాంధ్యకృత్యములెల్లఁ దీర్చి
శ్రీరాముఁడత్రి పూజింప సద్గోష్ఠి
నా రాత్రి గడపి కాల్యక్రియల్ దీర్చి
ముదమొప్ప నయ్యత్రిముని వీడుకొల్పఁ
గదలి యమ్మఱునాఁడు కాకుత్స్థకులుఁడు[వా.రా. సర్గ 1]
|