| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
జనకుఁడు ప్రతర్దనునకుం | దనకును రణమైన యపుడు తన యోధులకున్ విను నాకంబును నరకముఁ | గనుఁగొనుఁ డని చూపి చెప్పెఁ గౌరవముఖ్యా! |
444 |
| తే. |
పుణ్యతమము భోగాస్పదంబును మనోహ | రాంగనా జనబహులంబు నైనయది ర ణంబు బిరుదులై చేసిన నరుల నెలవు; | దూరఁ బందలచో టిది దుఃఖమయము. |
445 |
| వ. | అని తన మాహాత్మ్య ంబునం జూపనోపిన యుభయ స్థలంబులుం జూపం జూచి, యేచి యవ్వీరులు దెంపు వొంపిరి వోవం దఱియ నుఱికి వైరుల జయించిరి; సమరంబు తెగువ దీప్తలక్ష్మి ం గరంబొనర్చుఁ బుణ్యతమ లోకంబు లిచ్చుం గావున శూరుం డధిక పుణ్యోదారుం డని యిట్లు దేవవ్రతుండు ధర్మశూరునకు సమరానివర్తన జనవిశేషం బెఱింగించె నని చెప్పిన విని ‘యట మీఁద వారల సంప్రశ్నోత్తరంబులు ప్రవర్తిల్లిన విధంబులు వినిపింపు’ మనుటయు. | 446 |