| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అరణ్యకాండము |
|
నడుత్రోవ నొకపక్షినాథుని ఱెక్క లుడివోని కులగిరియో యనుదానిఁ గని దైత్యుఁడనుబుద్ధిఁగదిసి:“నీవెవ్వ?” డనుటయు ముదమందియా పక్షి వలికె: “గరుడాగ్రజాతుండు కశ్యపతనయుఁ డరుణసారథియైన యరుణుండు ఘనుఁడు మా తండ్రి;మఱియు సంపాతి మాయన్న; మీ తండ్రిసఖుఁడఁ జుమీ యేను రామ! యితరుఁడఁగాను; మీ హితకార్యపరుఁడ నతులసాహసుఁడ, జటాయువన్వాఁడ; నీ వనంబును నసురేంద్రసేవితము; కావున వైదేహిఁ గావు; మేమఱకు.” మనవుడు దశరథునట్లకా నతని మనమున యోజించి మైత్రిఁబూజించి |