| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అరణ్యకాండము |
|
యట పంచవటి కేఁగి యందున్న మునులఁ బటుతపోధనుల సంభావించి మ్రొక్కి[వా.రా. సర్గ 15] కరమర్థి వారు సత్కారముల్ సేయ ధరణీతనయఁజూచి తమ్మునిఁజూచి: “పొలుపొంద నెందును బుణ్యాశ్రమములు గలయఁబెక్కులు వొడఁగందుముగాని యీ గౌతమీగంగ యీ సరోవరము లీ గిరు లీ తరు లీ యాశ్రమములు నెందునుఁబొడఁగంటిమే;67యిట68మీఁద నిందుండుదము మన69మింపొంద.”ననుచు నానందమునఁబొంది యందున్నమునుల యానతి గైకొని యా ప్రొద్దె కడఁగి తాను సౌమిత్రియుఁ70 దగఁబర్ణశాల నూనినక్రమముతో నొప్పారఁగట్టి తమ్ముఁడుఁదానును దానిఁబూజించి యమ్మహీసుతఁగూడి యనురాగ మెసగ నా పర్ణశాలయం దాఱుమాసములు దీపించుపేర్మి వర్తింపుచు నుండె. |