| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
దేవేంద్రుఁడతి భక్తి దితికి శుశ్రూష గావించె నీ పుణ్యగణ్యదేశమున. నీ పుణ్యభూమి మున్నిక్ష్వాకుఁడనెడు భూపవర్యుం డలంబుసయందుఁగన్న కొడుకు విశాలుఁడన్ కువలయాధిపుఁడు పుడమినేలి విశాలపురి యిందొనర్చె. 453నా విశాలునిపుత్త్రుఁడై హేమచంద్రుఁ డావిర్భవించెను; నతఁడు సుచంద్రు, నతఁడు ధూమ్రాశ్వుని,నతఁడు సృంజయుని, నతఁడంత సహదేవు, నతఁడుకుశాశ్వు, నాతండు సోమదత్తాఖ్యుఁ, గకుత్స్థు నాతఁడు, సుమతిని నతఁడును గనిరి; తావుగాఁగాకుత్స్థతనయుఁ డాసుమతి యీ విశాలాపురం బేలెడి నిపుడు; అనఘ! వైశాలికులన వీరు జగతి వినుతికెక్కిరి ధర్మవిభవసంపదల; 454నిచ్చమై రఘు455రామ! యిచట నీ రాత్రిఁ బుచ్చి వేగినఁజూడఁబోదము జనకు.” 456ననునంత గాధేయుఁడటవచ్చు టెఱిఁగి మనమున సంతోషమగ్నుఁడై సుమతి తన పురోహితులును దన457బంధుజనులుఁ దనతోడఁ 458జనుదేరఁ దన పట్టణంబు వెలువడి చనుదెంచి విహితమార్గమున నెలమితో నా సంయమీంద్రుఁబూజించి కరములు 459ముకుళించి460కడుభక్తిఁబలికె: “ధరణిలో నేఁడు నే ధన్యుఁడ నైతిఁ; జరితార్థమయ్యె నా జన్మం.” బటంచుఁ బరమ461ప్రియంబులు పలికి యొండొరులు నమరంగఁగుశలంబు లడిగినమీఁద సుమతి విశ్వామిత్రుఁజూచి తా ననియె:[వా.రా. సర్గ 48] “మునినాథ! యసమానమూర్తు లీ ఘనులు ఘనభుజు, లనిమిషక్రమపరాక్రములు, కరిరాజ462గమనముల్,కంఠీరవములఁ బురుడింపఁజాలెడు463భూరి 464సత్త్వములు, 465లలితయౌవనము,లుల్లసితారవింద దళములఁదెగడు నేత్రములఁజెన్నొందఁ గరవాలములుఁగార్ముకంబు దొనలు ధరియించి తమదుపదన్యాసములను జగతి నా రవిచంద్రసంచార కలిత మగు 466నాకసంబు నా నలరించువారు; నిరువురుఁదమలోన నెల్లచందముల సరియగుచున్నారు జనులచూడ్కులకు; నీ కుమారకు లెవ్వ?రెవ్వరి సుతులు? నాకు నేర్పడ గాధినందన! చెపుమ.” యనిన విశ్వామిత్రుఁడంతయుఁదెలుప విని విస్మయంబంది వేడ్క నా సుమతి యా రాఘవుల నప్పుడర్థిఁ బూజింప వారు నా పూజలు వరుసఁగైకొనుచు నా రాత్రియందుండి యా ప్రభాతమున నా రాజు దముఁబంప నర్థితోఁజనిరి. |