| ఇతిహాసములు | రంగనాథరామాయణము | కిష్కింధాకాండము |
|
“మీరింక నా పంపు మేకొని పోయి శ్రీరమ్యముగను గిష్కింధఁగైసేసి 106చిరమైన కపిరాజ్యసింహాసనమునఁ బరగ సుగ్రీవునిఁబట్టంబు గట్టి యొంద నీ యంగదు యువరాజ్యపదము నందుఁబట్టముగట్టుఁ.”డని యొప్పఁబలుకఁ దడయక వానరదండనాయకులు గెడగూడి యంతఁగిష్కింధ కేతెంచి నూత్నశృంగారమనోహరాగార రత్న వితర్దికారమణీయహీర రంగ 107వల్లీ 108వారరంజితద్వార రంగద్ధ్వజోదార రమ్యపటీర నీరపూరితమార్గనిరుపమాకార పౌరసంచారసంభరితంబు గాఁగఁ జెలఁగి యా పురము గైసేయించి నగరు కొలువుకూటంబు మిక్కుటమైన సిరికిఁ గారణంబుగ నలంకారంబొనర్చి వారిధి నదనదీ వారియు మఱియుఁ దగుమంగళద్రవ్యతతులుఁదెప్పించి మొగినొప్ప శుభతూర్యములు మ్రోయుచుండఁ 109బుణ్యాంగ110నలు రత్నముల సేసఁజల్ల బుణ్యాహవాచనపూర్వకంబుగను సింహచర్మంబునఁజిహ్నితమైన సింహపీఠిని గపిసింహంబు నునిచి సుర లింద్రుఁబోలె భాసురలీలఁబ్లవగ వరు లభిషేకపూర్వకముగాఁగదిసి లలితపుణ్యోదయలగ్నంబునందు నిలుపఁ బలియు సుగ్రీవునిఁబట్టంబు గట్టి యురుసత్త్వు నంగదు యువరాజ్యమునకుఁ గరమొప్పఁబట్టంబు గట్టిరి ప్రీతి. నంగదు యౌవరాజ్యమునందు నిలుపఁ బొంగె వేడుక నంతిపురముఁబురంబు. నల నీల తారాంజనాతనూభవులుఁ గలబంధువులుఁబొడగనిరి సుగ్రీవు; నితరవానరనాథులెల్లఁగేల్మొగిచి యతిమోదమునఁగొనియాడిరి ప్రీతి. నంత సుగ్రీవుఁడుదాత్త సంపదల నెంతయుఁబెంపొంది యింపు సొంపొంది వనచరబలముతో వడి నేఁగుదెంచి ఘనరత్నకోటులు కానుక లిచ్చి యాదటఁబెంపొంద నా రామచంద్రు పాదపద్మములకు భక్తితో మ్రొక్కి కరములు ముకుళించి కడుఁబ్రేమ నిలిచి పరమసమ్మదమున భానునందనుఁడు: “ఇచ్చోట నేటికి? నింక నా పురికి విచ్చేయుదురుగాక విశ్వలోకేశ!” |