ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
ఆప్తసంప్రీణనము
దీవింప! రఘుకులాధిపుఁడు వేడుకలు
గావించు భోజనాగారంబునకును
జనుదెంచి హితులను సకలబాంధవుల
ననుజుల రవిజాదులైన వానరుల
నా విభీషణముఖ్యులగు దైత్యవరులఁ
బావనాత్మకు గుహుఁ బరగ రావించి
యుచితాసన2585ంబుల నుండంగఁబనిచె
సుచరిత్రు నంజనాసూనునిఁ దనదు
పొత్తున వేడుక భుజియింపు మనియె
నత్తఱిఁజాల నెయ్యముఁదియ్యమమర.
నెనయంగ నవ్వేళ నెలఁతలు దెచ్చి
కనకపుఁబళ్లెముల్‌ గ్రమమొప్ప నునిచి
పరగఁబాయసము సూపము లపూపములు
వరుగులు వడియముల్‌ వాంఛఁబుట్టించు
కూరలుఁబచ్చళ్లుఁగొమరొందు2586సిగర
లూరుఁగాయలును శాల్యోదనంబాత్మఁ
దనిపెడు సద్యోఘృతము వింతరుచులఁ
బెనుపొందు ఫలములుఁబ్రియముతో నిడఁగ
నినకులాధీశ్వరుండింపు రెట్టింప:
“ననిలజ! భుజియింపు.”మనుచు2587ఁదానొక్క
కబళంబుఁగొనిన నక్కపికులోత్తముఁడు
ప్రబలమౌభక్తి నప్పళ్లెరంబెత్తి
తలమీఁద నిడికొని తనర నాడుచును
జెలఁగుచు:“నో కపిశేఖరులార!
రండు; రామునిపళ్లెరముప్రసాదంబు
దండిగా దొరకె నందఱకు నేఁ.”డనుచు
మునివృక్షమెక్కి యిమ్ముల దాని దళము
లను వొందఁగాఁద్రుంచి యా ప్రసాదమున
నొనరించి సంతోషముల్లంబు నిండ
ఘనభక్తి నొసగె నా కపినాయకులకు.
వారును దానును వాంఛలు దీర
నారూఢిఁదృప్తులై రా ప్రసాదమున.
ననిశంబు నదిమొదల్‌ హరివాసరమున
మునివృక్షపర్ణముల్‌ ముఖ్యంబులయ్యె.
నంత నా రఘురాముఁడంజనాసుతుని
సంతతభక్తికి సంతోషమంది
పరపైన వేఱొక పళ్లెరంబునను
ధరణీశచంద్రుండు దా నారగించి
జలముల నొగివార్చి జతనంబు మీఱ
లలితసుగంధమాల్యము లొప్ప ముడిచి
2588కర్పూరతాంబూలగంధాక్షతంబు
లర్పింప దయమీఱ నందఱ కప్పు
డినకులోత్తముఁడిచ్చె నెల్లవస్తువులు.
మనమారనప్పుడు మహిమపెం పలర
సకలభృత్యామాత్య సహితుఁడై వేడ్క
నకలంకచిత్తుఁడై యట కొలువుండె.
నప్పుడు సౌమిత్రి ననురక్తితోడ
నొప్ప నిద్రాదేవి యొగిఁబొందుటయును
గొలువులోపలను గాకుత్థ్సునియెదుటఁ
గలకల నవ్వినఁగమలాప్తకులుఁడు
జనకజయును విభీషణుఁడు సుగ్రీవుఁ
డును మారుతాత్మజుఁడును వాలిసుతుఁడు
నలనీలశరభసన్నాదతారాది
బలిముఖుల్‌ శత్రుఘ్నభరతులు భీతిఁ
దలలు వంచిరి యప్డు తమయందుఁ2589జెంది
లలిమీఱినట్టికళంకముల్‌ దలఁచి.
యందఱుఁగొలువులో నట్లున్నయెడను
యందఱఁగని రాముఁడను జన్ముఁజూచి;
“వెలయంగ లక్ష్మణ! వివరింపు2590మీవు
నెలకొని నగి తేమి నిష్కారణముగ?”
ననవుడు భయమంది యా లక్ష్మణుండు
తనకరంబులు మోడ్చి2591తగ విన్నవించె:
“వనవాసమునకు దేవరఁగొల్చి వచ్చి
వనముల నున్నచో వచ్చె2592నీ నిద్ర.
వచ్చినఁబదునాల్గువత్సరంబులును
నచ్చుగాఁ2593జేరకు మన నిద్ర సనియెఁ.
బదునాలుగేండ్లును బరగ నిండుటయు
వదలక యిప్పుడు వచ్చె 2594నా నిద్ర.
యదికారణంబుగా నవనీశతిలక!
యిది నేను నవ్వితి; నిదియె నా తప్పు.2595
ఇది తప్ప నా మది నేమియు నెఱుఁగ
సదయాంతరంగ! మీ చరణంబులాన.”
యనవుడు నందఱు నాత్మలలోన
ననుమానములు వాసి యలరి రెంతయును.
నిర్మలకారుణ్యనిధి రాముఁడంత
నర్మిలి నిండార నందఱఁజూచి:
“యెల్ల తెఱంగుల నెల్లకార్యముల
నెల్ల ధర్మంబుల నేమఱ కెపుడు
గొనకొని సేయుఁడీ కోర్కి దీపింప
ననువొంద.”ననుచు నత్యాదరంబొప్పఁ
“బొం.”డని కడఁకతో బుద్ధులు గఱపి
యొండొండ ప్రియముల నూఱడఁబలికి
యనిలజసుగ్రీవు లాదిగాఁ గపుల
2596దనుజ విభీషణుఁదగ వీడుకొలుపఁ
గిష్కింధ కెలమి సుగ్రీవాదికపులు
నిష్కళంకాత్ములై నెమ్మితోఁజనిరి.
చనియె లంకకు విభీషణుఁడర్థిఁదన్ను
దనుజులు గొలువ నుత్సవకేళిఁదేలి.2597
రాముఁడు మఱి యౌవరాజ్యంబునందు
సౌమిత్రిభరతులఁ జతురమానసులఁ
దగఁబ్రతిష్ఠించి యాతత రాజ్యభూతిఁ
దగిలి సుఖించుచుఁదాను సీతయును
2598సకలభోగంబుల 2599సౌఖ్యంబు నొంది
యకలంక2600చిత్తుఁడై యనవరతంబు
వేదోచితాచారవిమలమార్గమున
నాది రాజన్యుల నందఱఁగడచి
పూజితానుష్ఠానములు నశ్వమేధ
వాజపేయాదికవరయాగతతులు
సొలవక చేయుచు సురల భూసురుల
నెలమి రక్షించుచు నేపు దీపింప
నిండారుధర్మైక నిష్ఠతోఁ బదునొ
కొండువేలేండ్లు దా నుర్విఁబాలించెఁ.
బాలించి యేలుచోఁ బ్రజలు దుఃఖములఁ
దూలరు; దురితముల్‌ దుర్భిక్షతతులు
గలుగ వెయ్యెడలను; గాలదోషములఁ
జలియింప వెన్నఁడు సత్యధర్మములు.
పరహితాచారతాత్పర్యంబు2601లెల్లఁ
బురుషులయందును బొలుపారుచుండు.
ననియాంధ్రభాషభాషాధీశనిభుఁడు
వినుత కావ్యాగమవిమలమానసుఁడు
పాలితాచారుఁ డపారధీశరధి
భూలోకనిధి గోనబుద్ధభూవిభుఁడు
తమ తండ్రి విట్ఠలధరణీశుపేరఁ
గమనీయ2602తరధైర్యకనకాద్రిపేరఁ
2603బనుగొన నరిగండభైరవుపేర
ఘనుపేర మీసరగండనిపేర
నలఘునిశ్చలదయాయతబుద్ధిపేర
లలిత2604సద్గుణగణాలంకారుపేర
నాచంద్రతారార్కమై యొప్పుమిగిలి
భూచక్రమున నతిపూజ్యమై వెలయ
నసమానలలితశబ్దార్థసంగతుల
రసికమై చెలువొంద రామాయణమునఁ
బరగ నలంకారభావనల్‌ నిండఁ
గరమర్థి నీ యుద్ధకాండంబుఁజెప్పె.
నారూఢి నార్షేయమై యాదికావ్య
మై రసికానందమై యెల్లనాఁడు
నివ్వసుమతి నొప్పు నీ పుణ్యచరిత.
మెవ్వరు సదివిన నెవ్వరు వినిన
సామాదిబాహు వేదచయధామరామ
నామచింతామణి నవ్యభోగములు
పరహితాచారముల్‌ ప్రభువిచారములుఁ
బరిపూర్ణశక్తులుఁబ్రకటరాజ్యములు
నిర్మలకీర్తులు నిత్యసౌఖ్యములు
ధర్మైకనిష్ఠలు దానాభిరతులు
నాయురారోగ్యంబు లధికసంపదలుఁ
బాయక పాటిల్లు; బాప క్షయంబు
వరపుత్త్రలాభంబు వైరినాశనము
సరినొప్పు; ధనధాన్యచయసమృద్ధియును,
నే విఘ్నములు లేక యిండ్లలో నధిక
లావణ్యవతులైన లలనలపొందు,
నన్నలుఁదమ్ములు నభివృద్ధిఁబొంది
మన్ననతోఁగూడి మలసియుండుటయు,
సతతంబు దేవతాసంతర్పణంబుఁ
బితృగణతృప్తియుఁబెంపొందుచుండు;
నిది మోక్షసాధనం; బిది పాపహరము;
నిది దివ్య; మిది భవ్య;మిదియు శ్రీకరము
రమణీయలీల నీ రామాయణంబుఁ
గ్రమమొప్పఁబూజింపఁగల్గుఁబుణ్యములు;
వ్రాసినవారికి వరశుభోన్నతులు
వాసవలోకనివాసంబుఁగలుగు.
నెందాఁకఁగులగిరు లెందాఁక జలధు
లెందాఁక రవిచంద్రు లెందాఁకఁదార
లెందాఁక వేదంబు లెందాఁక దిశలు
నెందాఁక భువనంబు లేపు దీపించు
నందాఁక నీ కథ యక్షరానంద
సందోహదోహళాచారమై పరగు.
  1. ములఁగూర్చుండంగ
  2. శిఖర
  3. నందొక్క
  4. అప్పుడు గంధాక్షతాది వస్తువులు - తెప్పించి యందఱఁదెఱఁగొప్పఁజూచి
  5. నున్న
  6. మిపుడు
  7. ధరణీశు కనియె
  8. ఁజూనిదుర
  9. దగదన్న నా నిద్ర
  10. ఁగా
  11. నీవు సహింపవో నిఖిలాధినాథ - దేవదేవేశ యో దీనమందార!
  12. దనుజపుంగవుని నత్తఱి వీడు
  13. ఎలమితో గుహునకు హితబుద్ధి సెప్పి - పొలుపొందఁబనిచినఁ బోయె నగ్గుహుఁడు- రాముఁడు మఱి…
  14. మహనీయ రాజ్యసమ్మదంబునఁబొంది- విహిత భోగంబుల వేడ్కలు సెంది
  15. ఁజతురత మెఱసి
  16. చరితుఁడై
  17. గలిగి-పురుషులెంతయఁబొలుపొందుచుండుదురు
  18. గుణ
  19. వనజోదరునిపేర వనమాలిపేర
  20. నిర్మలగుణా
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )