పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - తృతీయాశ్వాసము
ధర్మరాజునకు భీష్ముండు గణజనులం బాలించు ప్రకారంబు సెప్పుట (సం. 12-108-10)
క. ‘విను మర్థార్జకులును గా | ర్యనిపుణ మానసులు నాయుధాజీవులుఁ ద
క్కును గల పనుల జనులుఁ గల | రనఘా! యొక్కిండ్ల వార లైన జనంబుల్‌.
38
క. వారు గదాగణములు పతి | వారలతోఁ గలసి మెలఁగువడువున నయ్యై
వారి తెఱఁ గెఱుఁగవలయును | వారికి నెమ్మి గలిగించు వలనొదవుటకున్‌.
39
సీ. కుల మొక్కఁడైనఁ దేఁకువలేక బుద్ధియు | శౌర్యంబుఁ బెంపును సరకుగొనక
యెట్టివారలతోడ నెవ్వరైనను మత్స | రంబు గల్గుదురు గణంబు జనులు
దాన నంతర్భేదమైన శత్రులు వాపి | కొండ్రు గొందఱ నది గ్రొచ్చు రాజ్య
మూలంబుఁ గావున మున్ను భూపాలుండు | వారినందఱఁ దగు వచన రచన
 
తే. నీగి మన్ననఁ గలఁగంగనీక పొదివి | యధికముగ గణముఖ్యుల నాదరించి
పనులు గొనునది తమలోనఁ బాయకుండఁ | బ్రోవు లెడలిన రాజ్యంబు పొలుపు దప్పు.
40
క. ఎక్కార్యములను గణజను | లొక్కటి యై మెలఁగుచున్న నుర్వీశునకున్‌
మిక్కిలి సిరియగుఁ గావునఁ | దక్కక యరయంగవలయుఁ దగ గణవిధముల్‌.’
41
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )