ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
రాముఁడు దశరథు నూరార్చుట
రాముఁడా దశరథరాజు నీక్షించి
యా మహితాత్ముతో నచలుఁడై పలికెఁ:
“బదునాలుగేఁడులుఁబ్రకటదుర్గములఁ
బదునాల్గుదినములపగిది వర్తించి
ధరణీశ!వత్తు; సంతాపింపవలదు.
భరతుండు నా కంటె భక్తుండు నీకు;
నతనిఁబట్టముగట్టు; మాత్మఁ గైకేయి
కృతకంబునకు మదిఁ గింకిరిపడకు.
మా తల్లి నీకు నెమ్మది సేవసేయు;
నా తన్వి మీరును నరయుఁడు కరుణ.”
నని ప్రదక్షిణముగా ననుజుండుఁదాను
జనకజయును వచ్చి చాగిలిమ్రొక్క:[వా.రా. సర్గ 40, 41]
“నడవికిఁబోయి మీ రరుగుదెం.”డనుచుఁ
గొడుకులఁగోడలిఁ గోర్కి దీవించె.
నా సమయంబున నర్థి మువ్వురును
గౌసల్య పాదపంకజముల కెఱఁగ
వెలఁది రాఘవుఁడున్న వేషంబుఁజూచి
పలుమాఱు 234విధిఁదూఱి పలవించి పిదప

  1. పతిఁజూచి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )