ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
రామాదులు సుమిత్రను దర్శించుట
వచ్చి సుమిత్రకు వలగొని భక్తి
చెచ్చెరఁగార్యమ్ము సెప్పి మ్రొక్కుటయు
శ్రీరాము దీవించి సీత దీవించి
ధారుణీపతి239మాట దలపోసి వగచి
మెలుపొంద240నపుడు సుమిత్ర లక్ష్మణునిఁ
బిలిచి యింపలర గభీరోక్తిఁ బలికె:
“రాముని దశరథరాజుగాఁజూడు;
భూమిజ నన్నుఁగా బుద్ధిఁజింతింపు;
మడవి యయోధ్యగా నాత్మలోఁ దలఁపు;
కడుభక్తియుక్తి రాఘవుఁ గొల్చియుండు;
మాయతజయసిద్ధు లభివృద్ధిఁబొందుఁ;
బోయిర.”మ్మని ప్రీతిఁ బుత్త్రు దీవించి
రామచంద్రునిఁజూచి: “రఘువీర! నీకు
సేమంబు 241దలఁచి నీ చిత్తంబులోన
నఱలేనిసఖుఁడన్న ననుజన్ముఁడన్న
నెఱయ242నీతఁడె కాక నిక్కువం బరయ.
నటుగాన లక్ష్మణునరసి రక్షింపు
మటవులలో.”నన్న“నౌఁగాక.”యనుచుఁ
గృతకృత్యుఁడై యంత గృహదేవతలకుఁ
జతురుఁడై మునులకు జననుల కెఱఁగి
ధరణిజఁదోడ్కొని తాను లక్ష్మణుఁడు
శరచాపతూణీర సహితుఁడై వెడలె.

  1. సేఁత
  2. పిదప
  3. దలఁచిన
  4. భృత్యుఁడు నీకు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )