| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
వచ్చి సుమిత్రకు వలగొని భక్తి చెచ్చెరఁగార్యమ్ము సెప్పి మ్రొక్కుటయు శ్రీరాము దీవించి సీత దీవించి ధారుణీపతి239మాట దలపోసి వగచి మెలుపొంద240నపుడు సుమిత్ర లక్ష్మణునిఁ బిలిచి యింపలర గభీరోక్తిఁ బలికె: “రాముని దశరథరాజుగాఁజూడు; భూమిజ నన్నుఁగా బుద్ధిఁజింతింపు; మడవి యయోధ్యగా నాత్మలోఁ దలఁపు; కడుభక్తియుక్తి రాఘవుఁ గొల్చియుండు; మాయతజయసిద్ధు లభివృద్ధిఁబొందుఁ; బోయిర.”మ్మని ప్రీతిఁ బుత్త్రు దీవించి రామచంద్రునిఁజూచి: “రఘువీర! నీకు సేమంబు 241దలఁచి నీ చిత్తంబులోన నఱలేనిసఖుఁడన్న ననుజన్ముఁడన్న నెఱయ242నీతఁడె కాక నిక్కువం బరయ. నటుగాన లక్ష్మణునరసి రక్షింపు మటవులలో.”నన్న“నౌఁగాక.”యనుచుఁ గృతకృత్యుఁడై యంత గృహదేవతలకుఁ జతురుఁడై మునులకు జననుల కెఱఁగి ధరణిజఁదోడ్కొని తాను లక్ష్మణుఁడు శరచాపతూణీర సహితుఁడై వెడలె. |