| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
303నొగిఁగంద304మూలాదు లుపహారమునకుఁ దగ నాయితము సేయుతఱి నొక్కనాఁడు కడఁకతో నొకదుష్టకాకంబు 305సేరి యొడియుచు గాసిసేయుచు నున్నఁజూచి సీత యా కాకిఁజెచ్చెరఁజోఁపఁజోఁప నే తెఱంగునఁ బోవ కీడాడఁజూచి కడునల్గి రాముఁడా కాకంబుమీఁద వడి నిషీకముఁ306బుచ్చి వైచె; వైచుటయు విడువక యది దానివెనువెంటఁదగులఁ దడయక యది జగత్త్రయమును దిరిగి “కావు కా,”వనుచు దిక్పాలుర బ్రహ్మ దేవుని నమ్మహాదేవుఁ బ్రార్థింప వారలు దమచేత వారింపఁ307బడక: “శ్రీరాముశరణంబుఁజేరు.”మటన్నఁ జనుదెంచి 308మఱి తనశరణుసొచ్చుటయు ఘనమైనకృపతోడఁగాకంబుఁజూచి: “నా యస్త్రమెందు నెన్నఁడు రిత్తవోదు; నీ యంగ మొకటి దానికి నిచ్చిపొమ్ము.” అనవుడుఁదననేత్ర మా యస్త్రమునకు ఘనభక్తితో నిచ్చి కాకంబు వోయెఁ. జెలఁగి రాఘవుఁడంత సీతచే నున్న ఫలములు దేవతార్పణములు సేసి యా యున్నఫలముల నందఱుఁదృప్తు లైయుండి రిమ్ముల. నంత నక్కడను[వా.రా. సర్గ 57-60] |