| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
ప్రకట రాజ్యాంగ 90సంపదఁదేలితేలి యొకనాఁడు దశరథుండుల్లంబులోనఁ[వా.రా. సర్గ 8] దనకు సంతతి లేమిఁదలపోసి 91వగచి తన మంత్రివరులనందఱఁజూచి పలికెఁ: “బెక్కుదానంబులుఁబెక్కు ధర్మములుఁ బెక్కుయాగంబులుఁబెక్కువఁజేసి పెక్కేండ్లు మంటి;92శోభితకీర్తిఁగంటి; మక్కువ మీవంటిమంత్రులు గలుగఁ గొదవలే దేమిటఁ గొడుకులులేని కొదవ యొక్కటిగాని; కుల ముద్ధరించు కొడుకులు లేకున్నఁగోటిపుణ్యములఁ బడయరుత్తమలోక 93పదములెవ్వారుఁ; గాన పుత్త్రులఁగానఁగా నాకు వలయుఁ గాన యేనింక లోకములెల్ల మెచ్చఁ దలకొని యశ్వమేధము సేసి పిదప నెలమితోఁబుత్త్రకామేష్టి 94సేసెదను.” అని తగుపనులకు నందఱఁబనుప ననఘులు మఱి వసిష్ఠాదులు వచ్చి “యలవడ నీచేయు హయమేధమఖము నెలకొని యే మింక నిర్వహించెదము; మది నెన్నశక్యమే మఖరాజమహిమ. యిదిగాక పుత్రకామేష్టియుఁ జేయఁ దనయులఁగాంచెదు ధన్యమానసుల.” ననవుడు హర్షించి యవనినాయకుఁడు నందఱఁబనిచి శుద్ధాంతంబు సొచ్చి సుందరీమణుల కా శుభవార్తఁదెలిపి యనురక్తి నేకాంతమై యున్నవేళ ననఘుండు సూతుఁడిట్లనియె భూపతికి:[వా.రా. సర్గ 9, 10] “ధరణీశ! నీకు సంతానసంప్రాప్తి వెరవైన కథ మున్ను విన్నాఁడ నేను; |