| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
ధరణిఁదాటక యనుదానవురాలు కరులు వేయింటికిఁ గలలావు గలిగి పొలుపొందు నీ పురంబులు రెండు సొచ్చి యలవుమై బాధించు” ననుడు రాఘవుఁడు “ఎవ్వరు లావిచ్చి రీ యింతికింత? యెవ్వరి నిజపుత్త్రి యీ దుష్టబుద్ధి?[వా.రా. సర్గ 25] యీ పురంబులు రెండు నేల కారించు నీ పాపకర్మురా? లెఱిఁగింపుఁ”డనిన “నవని సుకేతుఁడన్ యక్షుండు దొల్లి తవిలి పద్మజుఁగూర్చి తపమాచరించి యడరెడునిష్ఠమై నతని మెప్పించి కొడుకు వేఁడుటయును “గొడుకు నీ కీను వెలసినగజముల వేయింటిలావు గలకూఁతు నిచ్చితిఁగనుము పొ.”మ్మనిన నా వరంబునఁగూఁతు నాతఁడు గాంచి భావించి సుందుని భార్యగా నిచ్చె. నతఁడవ్వధూటియందతి ఘోరసత్త్వ పతుల మారీచ సుబాహులన్ సుతులఁ బడసి లోకాంతరప్రాప్తుఁడౌటయును గొడుకులుఁదానునుఁ గూడి గర్వించి యా యింతి మఱి యగస్త్యాశ్రమంబునకుఁ బోయి 207తపస్వులఁబొదివి కారింపఁ గలశజుఁడా పాపకర్ములఁజూచి యలిగి‘రాక్షసులు గం’డని శాపమిచ్చె. నదియాదిగా రాక్షసాకృతుల్ పూని 208యదయత మానవాహారమున్ గొనుచుఁ దానుఁబుత్త్రులుఁగూడి ధరణిఁగారించు; దీనిఁజంపఁగలేరు తెగువ నెవ్వరును నీవొక్కఁడవుఁదక్క; నీ చేతఁగాని చావ; ‘దాటది’ యని చంపఁగాదనకు; మెనయ గోబ్రాహ్మణహితమైనఁజాలుఁ జనుఁజంపఁ గామినీజనుల రాజులకుఁ దొల్లి ధారుణియెల్లఁ ద్రుంపఁజింతించు ప్రల్లదురాలైన 209పడఁతి మంథరను సంపన్నమతి విరోచనుకూఁతు210 వజ్రి చంపఁడే యిది ప్ర211శస్తముగాదె యెందు నెఱయ212లోకమ్ము లనిద్రముల్ గాఁగఁ జెఱుపఁజిత్తంబునఁజింతించుటయును నలిగి దృఢవ్రతయగు భృగుపత్నిఁ జలమొప్ప విష్ణుండు సంపఁడే తొల్లి! యదిగాన లోక 213రక్షార్థ మంగనలఁ బొదివి చంపుటయును బుణ్యంబు లనఘ!” యనిన విశ్వామిత్రు నతులవాక్యములుఁ దన తండ్రిపనుపును దలఁచి రాఘవుఁడు[వా.రా. సర్గ 26] “హాటకగర్భాభుఁడగు మౌనిమాటఁ దాటక తాటక దండింతు” ననుచు ఘనధనుర్ఘోషంబు గగనంబు నిండ నినుచుటయును 214విని నిండఁగోపించి215 విదితాట్టహాసంబు వెలి దంష్ట్రరుచులు వెదసల్ల దివియెల్ల వెసఁబెల్లగిల్లఁ జరణఘట్టనములఁ జటులసత్త్వంబు ధరణికిఁదెలుపుచుఁ దఱిమి యే తెంచు తాటకఁజూచి యా దశరథరాముఁ డాటోప ముప్పొంగ ననియెఁదమ్మునికి: “చూచితే లక్ష్మణ! చూచితే దీని; 216నీ చంద మీ యంద మీ యుగ్రదృష్టి! దీనిఁజూచిన గుండెదిగులేరికైన మానునే? యటుగాన మర్దింతు దీని.” ననుచుండ గర్జన నాకసం 217బద్రువఁ జనుదెంచు పదధూళి సకలంబుఁగప్ప నలి మీఱి218ఘోర దానవురాలు ఱాలు గలఁగొని కురియ రాఘవుఁడు గోపించి యనుపమాస్త్రంబుల నమ్మహాశిలలు దునుమాడి దానిచేతులు రెండుఁద్రుంచె. 219నదియు విలూనభుజార్గళ యగుచుఁ గదిరిన కినుకతో గర్జింపఁజూచి ముక్కును జెవులును మ్రోడుగా నేసెఁ దక్కక సౌమిత్రి దారుణాస్త్రముల, మాయలుధరియించి మఱియుఁబెక్కమ్ము లా యింతి గురియ విశ్వామిత్రుఁడనియె: “ననఘ!సంధ్యాకాల మగుచునున్నదియు; దనుజుల నెందు సంధ్యల గెల్వరాదు; నీ వింకఁగృపమాలి నెలకొని దీని నీ విశ్వహితముగా నిట సంపు.”మనుడు గాధేయమునిమాట గడపక శబ్ద వేధిబాణముల నవ్వెడమాయ లడఁచి 220పెడపెడ నార్చుచుఁబిడుగుచందమున నడతెంచుచున్నదాన విని వీక్షించి మహితాస్త్రమొకటి సన్మఱఁగాఁడనేయ బహురక్తధారలు పర్వ నా వనిత యసురశిక్షారంభమందది రాముఁ డొసగెనో శరముల కుపహార మనఁగఁ బ్రళయమారుతమునఁబగిలి సంధ్యాభ్ర మిలఁగూలు తెఱఁగున నిలఁగూలెఁదూలి. యప్పుడానందించిరమరులు మునులు; నప్పుడానందించె నఖిలభూతములు. నా రాము దీవించి యాలింగనంబు గారవంబునఁ జేసెఁగౌశికుఁ. డంత- దేవగంధర్వాది దివిజులతోడ దేవేంద్రుఁడచటి కేతెంచి శ్రీరామ దేవునిఁగాంచి ప్రార్థించి పూజించి దేవవిధేయు గాధేయు నీక్షించి “మమ్ము రక్షింపంగ మహిఁ బుట్టినట్టి యిమ్మహాత్మునకు నీవిమ్మ భృశాశ్వు సంతానమైన యస్త్రముల శస్త్రముల నెంతయు.” నని చెప్పి యేఁగె నద్దివికి. నినుఁడంతఁగ్రుంక నయ్యెడను నాఁడుండి ముని మఱునాఁడు రామునిఁబ్రేమఁజీఱి |