ఇతిహాసములు రంగనాథరామాయణము కిష్కింధాకాండము
సుగ్రీవుఁడు కపియూధములతో మాల్యవంతముఁ జేరుట
ననిపల్కి హనుమంతు నతినీతిమంతు
గనుఁగొని: “మనవీటఁగల కపికోటిఁ
జాటించి వెడలింప సమకట్టు ప్రతినఁ
బాటించి; యెడసేయఁబాడి గాదింక.
మన మిప్పు డా రామమనుజేశుఁగానఁ
జనవలె.” నని పల్కి సంభ్రమంబెసగఁ
దరణినందనుఁడంతఁదారాదిసతుల
వెరవొప్ప నప్పుడు వీడ్కొని 138వచ్చి
కలయ దిక్కులనున్న కపియూధపతుల
బలములఁబిలిపించి పయనంబు సేసి
మేదినీభాగంబు మిన్నును దిశలు
భేదిల్లఁబ్రస్థానభేరి వ్రేయించి
ప్రబలకాంచనరత్నరమ్యమౌ నొక్క
శిబికపై లక్ష్మణుఁజెలిమి నెక్కించి[వా.రా. సర్గ 38, 39]
చామరద్వయ సితచ్ఛత్ర చిహ్నంబు
లా మహాత్ముని మ్రోల నరుగనేమించి
సబలుఁడై తానును సౌమిత్రి వెనుక
శిబిక యొక్కటి యెక్కి చిత్రవైఖరిని
ముందుగా శుభతూర్యములు బోరుకొనఁగఁ
గ్రందుగా వందిమాగధనుతుల్‌ సెలఁగ
నెడనెడఁగపినాథు లేతెంచి తన్నుఁ
బొడగన నుడుగణస్ఫురితేందుపగిది
సకలవానరవీరసైన్య సన్నాహ
మకలంకమై యొప్ప నప్పుడు గదలి
యరుదైన పేర్మితో నవని గంపింపఁ
గరము139సొంపెక్కి లక్ష్మణుఁగొల్చి నడచె.
నట మాల్యవంతంబునందున్న రాముఁ
డట మ్రోయుకలకలంబప్పు డాలించి
“యవె వచ్చెఁగపిసేన.”లని కోప ముడిగి
రవితనూజునిమీఁద రాగిల్లుచుండె.
నందమై మణికాంచనాంచితంబైన
యాందోళికాద్వయం140బల్లంత డిగ్గి
తామరసాప్తనందనుఁడు సంప్రీతి
సౌమిత్రియునుఁదానుఁజనుదెంచి మ్రొక్కి
యవిరళంబగు భక్తి హస్తముల్‌ మొగిచి
యవనివల్లభున కిట్లని విన్నవించె:
“దేవ! సేనలఁబిల్వ దెసలకుఁబంచి
వావిరి నవి గూడివచ్చునందాఁక
దండెత్తి యిట రాక తడసితిఁగాని
యొండొక్క 141వెంటమైనున్నాఁడఁగాను.”
అనిన నర్కజు రాముఁడతికృపాదృష్టిఁ
గనుఁగొని మన్నించెఁ. గడఁకతో నంతఁ
గైలాసగిరియందుఁ గనకాద్రియందు
నీలాచలమునందు నిషధాద్రియందు
ద్రోణాచలమునందుఁదుహినాద్రియందు
శోణాచలమునందు సోమాద్రియందు
(వృషభాచలమునందు వింధ్యాద్రియందు
ఋషభాచలమునందు ఋక్షాద్రియందు
బారియాత్రమునందుఁబ్రాగ్గిరియందు
నా రత్నగిరియందు నస్తాద్రియందు,
మలయాచలమునందు మంథాద్రియందు
గలగొన వర్తించుఘనబాహుబలులు
పవమానసూనుండు పనసుఁ డంగదుఁడు
గవయుండు నీలుండు గంధమాదనుఁడు
పావకాక్షుఁడు 142కాలపాశుండు గ్రధనుఁ
డావేగదర్శియు నగ్గవాక్షుండు
నలుఁడు మైందుఁడు మహానాథుండు దూమ్రుఁ
డలఘుండు 143జంఘుండు నగ్గిరిభేది
సుముఖుండు కేసరి జ్యోతిర్ముఖుండు
144విముఖుండు తారుండు 145వినతుండు గజుఁడు
జాంబవంతుండును సంపాతి రంభుఁ
డంబు146రాజుతనూజుఁడగు సుషేణుండు
శతబలి శరభుండు సన్నాథులనఁగ
నతివీరవరులు వీరాదిగాఁగపులు
తమసుతుల్‌ దమహితుల్‌ దమ సహోదరులుఁ
దమ చుట్టములుఁదాము దట్టమైకూడి
యివి పదులివి నూఱులివి వేలు లక్ష
లివి కోటు లవ్వల నివి శతకోటు
లనరాక పద్మ మహాపద్మ శంఖ
మనఁగఁ బర్వినసంఖ్యలన్నిటిఁగడచి
యెలమిసొంపున నేల యీనినభంగిఁ
జెలఁగి యే దిక్కుసూచిన వెల్లి విరిసి
యేమెయిఁగొలఁదిగా కేపు దీపించి
భూమియు నాకసంబును నిండఁగప్పి
కర ముగ్రగతిఁగ్రాలుకాలదండముల
పరుసున దీపించుబాహుదండములు
147గెడగూడి బడబాగ్ని 148కీలలువోలి
వడిఁబేర్చి దివి149రాయువాలపాశములుఁ
బొరిఁబొరిఁగాలాభ్రముల 150కాంతులనఁగ
నురవడి151మైఁగ్రాలునుగ్రదంష్ట్రములు
నలరెడు ప్రళయకాలాదిత్య బింబ
ములుఁ బోలె మండెడుముఖగహ్వరములు
లోలాబ్ధివిపులకల్లోలఘోషములఁ
బోలి ఘోషించు నార్పులు వెల్లివిరియ
బలములతోఁగూడఁబ్లవగవల్లభులు
గలగొనివచ్చునగ్గలికలు సూచి
యిచ్చలోపల నప్పుడిక్ష్వాకుతిలకుఁ
డచ్చెరువడి చూచి హర్షించుచుండె:
నా వేళ సుగ్రీవుఁడధిపతిఁజూచి:
“దేవ! నా సేన లేతెంచుచందంబు[వా.రా. సర్గ 40]
నవధరించితె; వీరలం దొక్కఁడొకఁడు
తివిఱి నీ పనులు సాధింప నోపుదురు.”
అనిచెప్పి వారల యలవులుఁబేళ్లు
జననముల్‌ జాతులు సత్త్వసంపదలు
తనువులు వర్ణముల్‌ దగుభోజనంబు
లునుకులు దేశంబు లోలి వర్ణించి
“యీ వానరాధీశు లిం దొక్కరొకరు
దేవ! నీ దేవి వైదేహిఁదెచ్చెదరు.
ఆనతి యి.”మ్మన్న నర్కజుఁదిగిచి
భూనాథుఁడాదరంబునఁగౌఁగిలించి:
“బలసంపదలయందు భానుజ! నీకుఁ
దలపోయ మఱి యసాధ్యములెందు152లేవు?
పూని నీ పౌరుషంబును జూచికాక
యే నేల కైకొందు నిటక్రింద నిన్ను.”
నని పల్కి,“వైదేహి నరసి రాఁబనుపు.”
మనవుడు హర్షించి యర్కనందనుఁడు

  1. పుచ్చి , నిలిపి
  2. తెం
  3. బల్లన నెఱఁగి
  4. రీతిమై, పనికినై
  5. వాల
  6. జంఘాలియ
  7. క్రమముతో
  8. గజుఁడు గోముఖుఁడు
  9. రాశి
  10. కడుఁబేర్చి
  11. కణములు వోలె
  12. ఁగ్రాలు
  13. మించుల
  14. మెఱసెడు
  15. ఁగలవు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )