| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - ఉత్తరభాగము |
| క. |
హరిరాక యెఱిఁగి ధర్మజు, డఱలేని ముదంబుతోడ ననుజులు బంధుల్ గురుజనసచివపురోహిత, పరిచారకకరిరథాశ్వభటయుతుఁ డగుచున్. |
685 |
| క. |
చిందములు మొరయ గాయక, బృందంబుల నుతులు సెవుల బెరయఁగ భక్తిన్ డెందము దగులఁగఁ బరమా, నందంబున హరి నెదుర్కొనం జనుదెంచెన్. |
686 |
| వ. | ఇట్లు చనుదెంచి ధర్మనందనుండు సమాగతుండైన సరోజనాభునిం బెద్దతడవు గాఢాలింగనంబు చేసి, రోమాంచకంచుకితశరీరుండై యానందబాష్పధారాసిక్త కపోలుండై నిర్భరానందకందళితహృదయుండై బాహ్యంబు మఱచియుండె; నప్పుడు హరిని వాయునందనవాసవతనూభవులు గౌఁగిటం జేర్చి సమ్మదంబు నొందిరి; మాద్రేయులు దండప్రణామంబు లాచరించి; రంతఁ బుండరీకాక్షుండు విప్రవృద్ధజనంబులకు నమస్కారంబు చేసి, వారలు గావించు వివిధార్చనలం బరితుష్టుండై కేకయసృంజయాదిభూవిభుల మన్నించి సూతమాగధాదుల కనేకపదార్థంబు లొసంగి, చతురంగబలసమేతుండై వివిధమణితోరణాది విచిత్రాలంకృతంబు నతివైభవోపేతంబునైన పురంబు ప్రవేశించి రాజమార్గంబునం జనుచుండఁ బౌరకామిను లట్టి యెడ. | 687 |
| సీ. |
కొఱనెలపైఁ దోచు నిరులునాఁ జెలువొంది నొసలిపైఁ గురులు తుంపెసలు గునియ హాటకమణిమయతాటంకరోచులు గండభాగంబుల గంతు లిడఁగ స్ఫురితవిద్రుమనిభాధరబింబరుచితోడ దరహాసచంద్రిక సరసమాడ నొండొంటితో రాయు నుత్తంగకుచకుంభములు మొగంబులకును బుటము లెగయ |
|
| తే. |
బడుగునడుములు వడఁకంగ నడుగు లిడఁగ, రవళిమెట్టెలు మణినూపురములు మొరయఁ బొలుచు కచబంధములు భుజంబుల నటింపఁ, బయ్యెదలు వీడి యాడ సంభ్రమముతోడ. |
688 |
| వ. | ఇట్లు కృష్ణసందర్శన కుతూహల పరస్పరాహూయమానలై గురుపతి సుతబంధుజనంబులు వారింప నతిక్రమించి సమున్నతభర్మహర్మ్యశిఖరాగ్రంబు లెక్కి కృష్ణుం జూచి తమలో నిట్లనిరి. | 689 |
| సీ. |
విశ్వగర్భుండునా వెలయు వే ల్పిల యశోదానందులకుఁ బ్రియసూనుఁ డయ్యె; బ్రహ్మాదిసురలకు భావింపఁగా రాని బ్రహ్మంబు గోపాలబాలుఁ డయ్యె; వేదశాస్త్రంబులు వెదకి కానఁగలేని గట్టి వ్రేతల ఱోలఁ గట్టుపడియె; దివిజుల కమృతంబు దవిలి యిచ్చిన భక్తసులభుండు నవనీతచోరుఁ డయ్యె |
|
| తే. |
నెనయఁ గమలాసతికిఁ జిత్తమీని వేల్పు, గొల్లయిల్లాండ్ర యుల్లముల్ పల్లవింపఁ జేసె నని కామినులు సౌధశిఖరములను, గూడి తమలోన ముచ్చటలాడి రధిప! |
690 |
| వ. | మఱియును. | 691 |
| సీ. |
గోపాలబాలురఁ గూడి యాడెడివాఁడు వ్రేపల్లెలోపల నేపు రేఁగి, చల్ల లమ్మగఁ బోవుసతులకొంగులు పట్టి మెఱుఁగుఁజెక్కిళ్ళను మీటి మీటి, కలికియై ముద్దాడిఁ గౌఁగిటఁ జేర్చిన పూఁబోఁడికుచములు పుణికి పుణికి పాయనియనురక్తి డాయఁ జీరిన యింతి యధరసుధారసం బాని యాని |
|
| తే. |
యురుసమాధిపరాష్టాంగయోగయుక్తు, లైన యోగీశ్వరులు గాననట్టి జెట్టి వల్లవీజనవనకల్పవల్లి యయ్యె, ననుచుఁ బొగడిరి కృష్ణు న య్యబ్జముఖులు. |
692 |
| మ. |
అని యిబ్భంగి సరోజలోచనలు సౌధాగ్రంబు లందుండి య వ్వనజాతాక్షుని దివ్యమూర్తిఁ దమభావంబందుఁ గీలించి సం జనితానందరసాబ్ధిమగ్న లగుచున్ సంప్రీతిఁ దద్భవ్య కీ ర్తనలై చల్లిరి నవ్యలాజములు మందారప్రసూనావలుల్. |
693 |
| వ. | తదనంతరంబ శోభనపదార్థంబులు కొనివచ్చి ధరామరధరావరవణిక్పుంగవులు దామోదరునకు కానుక లిచ్చిరి. పుణ్యాంగనాజనంబులు పసిండిపళ్లెరంబులఁ గర్పూరనీరాజనంబులు నివాళింప నంతఃపురంబు సొత్తెంచె; నంతం గుంతిభోజనందనయుం గృష్ణునిం గని పర్యంకంబు డిగ్గి కౌఁగిలింప నా యదువల్లభుఁడు మేనత్తకుం బ్రణామం బాచరించెఁ; బాంచాలియు ముకుందునకు నభివందనం బొనరించి కుంతిపంపున గోవిందుభామినులగు రుక్మిణి మొదలగువారికి గంధాక్షతకుసుమతాంబూలంబు లిడి లలితదుకూలమణిభూషణంబులం బూజించె; యుధిష్ఠిరుండును గమల నయనుని వధూజనుల ననుగత బంధుమిత్రపుత్త్రసచివపురోహితపరిచారకసముదయంబుల నుచితంబులగు స్థలంబుల విడియింప నియమించి దినదినంబును నభినవంబులగు వివిధోపచారంబులు గావించుచుండె. | 694 |
| క. |
హరియు యుధిష్ఠిరుసముచిత, పరిచర్యల కాత్మ నలరి పార్థుఁడు దానున్ సరసవిహారక్రియలను, సురుచిరగతిఁ గొన్నినెలలు సుఖ ముండె నృపా! |
695 |
| వ. | అంత | 696 |