| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
నారాయణాంకతలమున | శ్రీ రాజిల్లంగఁ జూచి, చిత్తం బతి వి స్మేరం బై రుక్మిణి వి | స్తారరుచిరనయన యగుచు, సంభావనతోన్. |
283 |
| వ. | ‘నీ వెట్టి పురుషులయందు, నెబ్భంగి భామలపాల వసియింతు?’ వనిన నా దేవి మకరధ్వజమాతకుం జెప్పిన వాక్యంబుల యర్థంబు లుపన్యసించెద; దాన నీ యడిగినయది తేటపడు; నాకర్ణింపుము. | 284 |
| సీ. |
‘నిత్యసత్యులు, శౌచనిరతులు, గురుభక్తు, | ల ప్రమత్తులు, దక్షు లమలమతులు, సత్కర్మపరులు, విజ్ఞానముఁ దపము దా | నము బ్రహ్మచర్యంబు శమముఁ గల్గు వారలు, ప్రీతి నా వసియించు నిక్కలు | క్రూరు, నాస్తికుఁ, గృతఘ్నునిఁ, గుబుద్ధి వర్జింతు; నెంగిలి వర్జించి, యిలువాడి | ఘటశుద్ధి గలిగిన కాంతలందు |
|
| తే. |
నిల్తు ; వల్లభ ప్రతికూల, నిష్ఠురాత్మ | నన్యమందిరగామిని, నధికనిద్ర యైన మానినిఁ దొఱఁగుదు ; నబ్జినీ త | టాక తరుషండ పుష్ప వాటముల నిలుతు’. |
285 |
| వ. | అని చెప్పెఁ దత్ప్రకారంబులు బుద్ధిగతంబులు సేసికొమ్మనినం, గురుపతి ‘పురుషుల పురంధ్రులసంగతి యందు సంస్పర్శ సుఖంబు నతిశయం బెవ్వరికిం గలుగు?’ నని యడిగిన వియత్తటినీ తనూజుం ‘డివ్విషయంబున కొక్క యితిహాసంబు గలదు; విను’ మని యిట్లనియె. | 286 |