| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అనిన విని యజ్జనపతి జాహ్నవీనందనుతోఁ ‘గన్యావరణ ప్రకారంబు విచారణీయం బైన కృత్యంబు; దాని తెఱం గెఱింగింపవే’ యనుటయు, నతం డతని కిట్లనియె. | 220 |
| క. |
‘కులమును, శీలము, విద్యయు | గలవానిం బిలిచి , ప్రీతిఁ గన్నియ నీఁ గా వలయు, నుదక ప్రదానా | కలితంబుగ; బ్రాహ్మ కర్మ గతి యిది యధిపా! |
221 |
| ఆ. |
క్షాత్ర మండ్రు బుధులు, గన్య పురుషుఁ గోర | నతఁడు గన్య మీఁద నాస సేయ, నచల మగు పరస్పరానురాగము గని | ప్రమదమెసఁగఁ జేయు పరిణయంబు. |
222 |
| క. |
కన్ను మనంబును దనిసిన | గన్నియ యెవ్వానిఁ గోరు గాంధర్వం బా యన్ను నతని కిచ్చుట, వెల | వన్నుట యాసురము సూవె పౌరవముఖ్యా! |
223 |
| క. |
బలిమి మెయి వరుఁడు గన్నెకుఁ | గలవారిం బొడిచి, కరము క్రౌర్యంబున, న ప్పొలఁతుక దుఃఖింపఁగ, వా | రలు వొగులఁగఁ, దెచ్చికొనుట రాక్షసము నృపా! |
224 |
| వ. | ఇట్లు సెప్పంబడునట్టి. | 225 |
| ఆ. |
అయిదు దెఱఁగులందు నారయ మూఁడు వి | ధములు ధర్మకృతులు ధర్మపుత్ర! యాసురంబు రాక్షసాహ్వయంబును ధర్మ | దూర సంవిధాన దూషితములు. |
226 |
| తే. |
మాతృ పితృ హీనయైనను, భ్రాతృరహిత | భావ మొందిన నబ్బాల పరిణయార్థ వరణమున కర్హ గా దని, కురుకులాగ్ర | గణ్య! చెపుదురు పరిణయకల్పవిదులు. |
227 |
| ఆ. |
ఆత్మజాతియందు, నవుల జాతులు రెంటఁ | గ్రమవివాహ మొప్పు బ్రాహ్మణునకు ననఘ! శూద్రవనితయందు నాతని కప | త్యంబు గలిమి పాప మనియుఁ గలదు. |
228 |
| తే. |
రాజునకు రాజవంశజ రమణి యైన | వెనుక వైశ్యవరించుట విహిత విధము వైశ్యునకు శూద్రునకుఁ దమ వంశములన | పరిణయంబు గాఁదగు నరపాలవర్య! |
229 |
| వ. | రాజునకు, వైశ్యునకు శూద్రకన్యావరణంబు సేయుటయును గలిగియుండు’ నని చెప్పిన విని యక్కౌంతే యాగ్రజుండు శాంతనవుతో’ బాహ్మణునకు శూద్రజాతి యందు భార్యా పరిగ్రహంబు సేయందగు నని విందును; అతనికి భార్యలు మువ్వురని నిర్దేశించితిరి. అది యెట్లొకో? యనుటయు నతం డమ్మహీపతి కిట్లనియె. | 230 |
| ఆ. |
అనఘ! విషమ మైన యట్టికార్యంబు వా | టిలినఁ జూచి, పెద్ద వలచి యైన లోభమునను శూద్రఁ దా భార్యఁగాఁ గొను | విప్రుఁ డధికపాపవృత్తి గామి. |
231 |
| వ. | అవ్విధంబు నొక్కొక్క యెడం గల్గి దూష్యంబు గాక చెల్లునని చెప్పి వెండియు. | 232 |
| క. |
‘ధరణీసుర, రాజ, వణిక్ | తరుణులకును విప్రువలనఁ గల్గిన తనయుల్ కురునాథా! ద్విజు లనఁగా | బరఁగుదు; రది లేదు శూద్రభామ సుతులకున్.’ |
233 |
| వ. | అనవుడు ధర్మపుత్త్రుండు ‘భూసురుని వలన నాలుగు జాతుల నాతులకును బ్రసూతులైన సుతులకును నతని ధనంబునందు భాగం బెట్లుండు?’ నని యడిగిన. | 234 |
| సీ. |
‘విను, జనమేజయ మనుజేంద్ర! యమ్మేది | నీశ్వరుతో భీష్ముఁ డిట్టులనియెఁ; బ్రాహ్మణు నర్థంబు పది పాళ్ళుగాఁ జేయ | నాలుగు బ్రాహ్మణి నందనుండు, క్షత్రియాత్మజుఁడు భాగములు మూఁడును, వైశ్య | తనయుండు రెండు, శూద్రాతనూజుఁ డొక పాలు గొనుటకు నొడయులు; తుదివాఁడు | వలచి పెట్టఁగఁ గొనువాఁడు గాని |
|
| తే. |
తండ్రితోడఁ ద్రివిధ తనయులతోడను | దనదు భాగమునకుఁ బెనఁగి కొనఁగఁ దగదు వారలకును దగదు నిర్దయతఁ ద | ద్దశమభాగ మీక తార కుడువ.’ |
235 |
| వ. | అనిన విని పాండవాగ్రజుండు ‘దక్కిన వర్ణంబులవారి ధనంబు లెట్లుగాఁగలయవి సెప్పు’ మనుటయు ననిమిష నదీనందనుం డతని కిట్లనియె. | 236 |
| సీ. |
‘క్షత్రియు ధనము భాగము లెనిమిది సేయ, | భూపాల వైశ్యుల పుత్రికలకు, శూద్ర పుత్రికకును, సుతులైన యట్టి వా | రోలి నాలుగు, మూఁడు నొక్కటియును, గొనువారు పాళ్ళులు, కురుముఖ్య! వైశ్యుని | సొమ్మున వైశ్యకు సూనుఁ డైన యతఁడు నాలుగును శూద్రాత్మజుఁ డొకటియుఁ | గాఁగ నైదుగ నంశకములు గొండ్రు |
|
| తే. |
పెనఁగి కొనఁగఁ దగమి విన శూద్ర కొడుకున | కెందుఁ గలదు; వాని కీక కుడువఁ గామియును సమంబ యేమి జాతులవారి | కయిన నిట్లు దెలియు మంశకృతులు. |
237 |
| తే. |
ఆలు నిజజాతియందు, శూద్రాలి కెల్ల | సమములుగఁ బంచికొండ్రు భాగముల శూద్ర తనయు లెందఱు గల్గినఁ దండ్రి ధనము | ధర్మసంగ్రహతత్పర! ధర్మతనయ!| |
238 |
| వ. | అని నిర్దేశించి వెండియు. | 239 |
| క. |
‘విను హవ్య కవ్యములు మ | జ్జన భోజనములును, విప్రజాతి వనిత దాఁ బనిసేయ నడపునది, య | ప్పనులకుఁ బెఱసతులు గామి బ్రాహ్మణుఁడు నృపా!’ |
240 |