| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| వ. | కృష్ణునకుఁ బ్రణమిల్లి ‘దేవా! భూదేవ మాహాత్మ్యంబు వినవలతు నానతీయవే’ యని వినయసంభృతుం డగుచుఁ బ్రార్థించిన నప్పార్థివుని మీఁదఁ గరుణామృతమయంబగు నాలోకనం బొలయ నద్దేవుం డాదరభరితుండై యిట్లనియె. | 368 |
| క. |
‘ననుఁ బ్రద్యుమ్నుం డివ్విధ | మున నడిగిన వాని కేను ముద మందుచు నా తని హితము గోరి కుంతీ | తనయాగ్రజ! యున్నరూప తగ నిట్లంటిన్. |
369 |
| సీ. |
వర్గత్రయము నపవర్గంబు సాధింప | నమర పితృ ప్రీతు లాచరింప నైహికసుఖము లుపార్జింపవలసిన | వారికి విప్రుల చేరుగడలు; దివిజులకైన నాయువు శ్రీయుఁ గీర్తియుఁ | దనరుట తత్ప్రసాదమునఁ జూవె! యలిగి భస్మము సేయ వలచి పెం పొసఁగంగ | నవనీసురులు శక్తు; లట్టు లగుట |
|
| తే. |
వారిఁ గోపింపఁ జేయక వారలకుఁ బ్రి | యంబు సేయుచు వారు ప్రహర్ష మొందఁ దనకుఁ గలభంగి నిచ్చు నతండు రెండు | భువనములయందుఁ బెంపును బొగడుఁ బడయు. |
370 |