| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| తే. |
‘దేవదేవ! జీవాత్మక! దేవవంద్య! | శంఖ చక్ర గదా పద్మ చారుహస్త! వాసుదేవ! త్రివిక్రమ! వరద! పరమ | పురుష! ప్రణతి యొనర్చెదఁ గరుణఁ జూడు.’ |
461 |
| వ. | అనుచు నమస్కరించి. | 462 |
| ఆ. |
‘బలము నీవ నాకు, భక్తుండ నీయెడ, | నాలుబిడ్డ లేని యట్టివాఁడఁ, గావు నన్ను నధిక కారుణ్యమున నిమ్మ | నుజ్ఞఁ గమలదళమనోజ్ఞనయన!’ |
463 |
| వ. | అని వెండియు. | 464 |
| సీ. |
‘మాధవ! పాండుకుమార వర్గమునకు | గతి నీవ; రక్షింపు కరుణ మెఱయ; దుర్బుద్ధియైన యా దుర్యోధనుని తోడఁ | గృష్ణుఁ డెక్కడ నుండు గెలుపు గలుగు నక్కడి కంటి నేఁ బెక్కుమాఱులు; నట్లు | చెప్పఁగా నా పంపు సేయ కతఁడు దమవారి నెల్లను సమయించి తానును | సమసె; ని న్నెఱుఁగుదు; నమిత మహిమ |
|
| తే. |
నరుఁడు నారాయణుఁడు నను పరమమునులు | జగము రక్షించుటకుఁ గేలి జన్మ మొంది సంచరించెద రని పరాశరసుతుండు | నారదుండును జెప్పిరి నాకుఁ దొల్లి.’ |
465 |
| వ. | అనిన విని వాసుదేవుండు దేవవ్రతు వదనం బత్యాదరంబున నాలోకించి. | 466 |
| ఆ. |
‘కీ డొకప్డు లేదు, కృతపుణ్యుఁ డవు, తండ్రి | వలని భక్తి పెంపు గలవు; దానఁ గాదె బంటుఁ బోలె గాంగేయ! మృత్యువు | నీవశమున నిలిచె నిర్భరముగ. |
467 |