| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
ధర్మపుత్త్రుండును దమ్ములు విదుర యు | యుత్సులు నగరు కాష్ఠోత్కరంబుఁ జందన దారు సంచయమును గొని సమ | స్థలి సమంచిత చితి యలఘు భంగి విరచించి; రయ్యుధిష్ఠిరుఁడును ధృతరాష్ట్రుఁ | డును న మ్మరున్నదీ తనయు పుణ్య గాత్రంబు సుస్నాన కలితంబు విహితాను | లేపంబుఁ బుష్పదామోపశోభి |
|
| తే. |
తంబు నుత్తమ క్షౌమావృతంబు నుజ్జ్వ | లాభరణ భూషితంబుఁగా నధికభక్తిఁ జేసి; రప్పుడు సామంబు సెలఁగ హోమ | మాచరించిరి యాజకు లగ్ని యలర. |
469 |
| క. |
కనకములు మణులు భూసుర | జనసం ఘంబున కజాతశత్రుఁడు శ్రద్ధా వినయప్రీతి యుతంబుగ | ననేకములు వేడ్క నొసఁగె నవహిత మతియై. |
470 |
| వ. | తదనంతరంబ. | 471 |
| క. |
తలదిక్కు గవలుఁ బాదం | బుల దెస ధృతరాష్ట్ర పాండు భూపాగ్రతనూ జులుఁ బట్టి యధిక విభవో | జ్జ్వల మగు పాడె పయి నిడిరి శవరత్నంబున్. |
472 |
| వ. | అమ్మెయి నన్నలువురును వహించిరి; భీమసేనార్జునులు ధవళచామరంబు లిడిరి; యుయుత్సుం డుత్తమచ్ఛత్రంబు వట్టె; వృద్ధలగు కౌరవ స్త్రీ లాలవట్టంబులు వట్టిరి; ధౌమ్యుండు క్రియా కలాపంబు నడపె; నట్లు సొదసేర్చి దేవవ్రతుని దేహంబు శ్రౌతాగ్ని కాహుతి చేసి బహుకుండంబు లెత్తి ఘృతంబు ప్రయోగించి ప్రజ్వలింపఁ జేసి; రివ్విధంబునం బితృమేధంబు విభవమహితంబును, విధివిహితంబు నుంగా ననుష్ఠించి య క్కౌరవు లపసవ్యంబుగాఁ దిరిగి కృష్ణద్వైపాయన నారద దేవల ప్రభృతు లనుగమింప భాగీరథికిం జని సర్వభరతభార్యా సమేతంబుగా న గ్గాంగేయునకుఁ దిలోదక ప్రదానంబు లాచరించి; రట్టి సమయంబున. | 473 |