| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
ఉదకంబులందుండి యుత్థితయై శోక | విహ్వలత్వంబున వికల గమన యగుచు నెమ్మోముపై నశ్రులు గ్రమ్మగాఁ | జనుదెంచి కౌరవసమితి యెదుర నిలిచి భాగీరథి ‘యలఘుండు తన కొడు | కిలఁ బరికింపఁగా నెట్టిభంగి వాఁడయ్యెఁ? జరితంబుపోఁడిమి మీరెల్ల | నెఱుఁగుదు; రైనను నేను గొంత |
|
| తే. |
సెప్ప వినుఁడు! దృఢ వ్రతశీలుఁ, డమల | బుద్ధి రాజవృత్తాఢ్యుఁడు, భూరికృపుఁడు, కార్యసంవేది, పితృభక్తి ధుర్యుఁ, డార్య | సమ్మతుండు, విద్యా పరిశ్రమ ఘనుండు. |
474 |
| తే. |
కాశిరాజ కన్యకలకుఁగాఁ బెనంగి | వానిచే గాసియైరి భూవరులు పలువు రంబకై పూని వానిమహాబలంబు | జామదగ్న్యుండుఁ దెరలుపఁ జాల కరిగె.’ |
475 |
| వ. | అని విలాపంబు చేసి వెండియు. | 476 |
| తే. |
‘అంతవాఁడు శిఖండిచే నట్టు లగుట | గనియుఁ బెక్కులు పఱియలు గాక యునికి కతనఁ జేసి వజ్రమయంబు గాఁగ నోపు | నని తలంచెద నాడెంద మన్నలార!’ |
477 |
| వ. | అని వగచిన గంగాదేవికి దేవకీనందనుం డిట్లనియె. | 478 |