పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - పంచమాశ్వాసము
హారీతుండు విద్వజ్జనుల కుపదేశించిన తత్త్వప్రకారము (సం. 12-269-2)
సీ. వారి కి ట్లనియె ‘నిష్ఠారంభమతి నిలు | వెడలి కోర్కుల కెల్ల విముఖుఁ డగుచు
జనములకీడు వాక్చక్షుర్మనోవర్త | నములఁ గూర్పక మైత్రి సమతఁ గరుణ
గలిగి, నిందాప్రశంసల ఖేదమును నుబ్బు | లేక పాడింటను నేకతంపు
గుడి మ్రాని పొంతను గుహలోన నుండుచు | డంపకములకు వంటకములకును
 
తే. భోజనములకుఁ దఱియైన ప్రొద్దు గడపి | భిక్ష గొనుఁ బ్రీతి మన్నన పెద్దవెట్టు
నట్టియెడఁ దక్కి క్రొత్తగా నరుగు యతి ని | రంతరంబు నాత్మారాముఁ డై చరించు.
393
తే. అనిన వారు కృతార్థులై యతనిఁ బ్రస్తు | తించి రని చెప్పె విని నరదేవవరుఁడు
దేవతటినీ తనూజుతో ‘భావశుద్ధి | కలిమి యొప్పుఁగదే!’ యని పలికి మఱియు.
394
తే. రాజభావంబు తొడుసునఁ గ్రచ్చుకొన్న | మనసుతో నుండ కెన్నఁడో మరలి యింద్రి
యముల నిర్జించి సత్త్వాదు లవులఁ ద్రోచి | యేను శాంతిసుఖంబున కెలయు టనఘ!’
395
చ. అనుటయు నాతఁ డిట్టు లను నక్కురుభర్తకు ‘వేగ మేటికిన్‌
ఘనభుజ? యెల్లచందములుఁ గాలముతోడివ చుమ్ము; వర్ణధ
ర్మనిరతి చిత్తపాకము గ్రమంబునఁ దెచ్చుఁ గషాయపక్వతన్‌
బనుపడ కర్హుఁ డేలగు నృపాలకుమారుఁడు సన్న్య సింపఁగన్‌?
396
వ. ఇవ్విషయంబున వృత్రగీత యను నితిహాసంబు గలదు వినుము. వృత్రుండు భండనంబునం బడిన నెత్తికొనిపోయి పెట్టుకొని యున్న యెడ నయ్యవస్థ నొందియు విషాదంబు లేకయున్న యద్దనుజవిభునితో శుక్రుండు ‘వైరిహృతవిభవుండవైన నీకు మనోవ్యథ లేమికిఁ గతంబేమి?’ యని యడిగిన నతం డతని కిట్లనియె. 397
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )